ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయిప్పుడు. ఒకటి తన చేతిలో ఉన్న `రాధే శ్యామ్`. ఆ తరవాత నాగ అశ్విన్ సినిమా చేయాలి. ఆది పురుష్ కూడా ఉంది. `రాధే శ్యామ్` అయ్యాక.. `ఆది పురుష్` ప్రారంభం అవుతుందనుకున్నారు. ఆ తరవాత నాగ అశ్విన్ సినిమా కంప్లీట్ చేయాలి. అయితే ఈ రెండు సినిమాల్ని ప్రభాస్ వెనక్కి నెట్టినట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో ప్రశాంత్ నీల్ సినిమాని ఓకే చేసినట్టు సమాచారం.
కేజీఎఫ్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ప్రశాంత్ నీల్. అప్పటి నుంచీ ప్రశాంత్ నీల్ - ప్రభాస్ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అయితే అనూహ్యంగా... ప్రశాంత్ నీల్ సినిమానే ముందు మొదలెట్టాలని భావిస్తున్నాడు.
ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 పూర్తవగానే ప్రభాస్ సినిమాని పట్టాలెక్కించేస్తారని తెలుస్తోంది. 2021 లోనే ప్రభాస్- ప్రశాంత్ నీల్ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నార్ట. ఆ తరవాత... ఆదిపురుష్, అది పూర్తయ్యాక నాగ అశ్విన్ సినిమాకి స్టార్ట్ చేస్తారట. అంటే 2024 వరకూ ప్రభాస్ ఫుల్ బిజీ అన్నమాట. కాకపోతే.. ప్రాజెక్టులే ముందుకీ వెనక్కి వెళ్లాయి. అంతే.