'క్వీన్‌'ని పట్టేసిన 'అ' దర్శకుడు

మరిన్ని వార్తలు

విభిన్నమైన కథాంశంతో విచిత్ర కథనంతో 'ఆ' చిత్రాన్ని తెరకెక్కించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. షార్ట్‌ ఫిలింస్‌ మేకర్‌గా ఎంతో అనుభవం ఉన్న ప్రశాంత్‌ వర్మ ఫస్ట్‌ అటెంప్ట్‌తోనే బిగ్‌ స్క్రీన్‌పై పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడీ యువ దర్శకుడు ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌ని చేజిక్కించుకున్నట్లుగా తాజా సమాచారమ్‌. 

బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్‌ 'క్వీన్‌' సినిమాని సౌత్‌లో నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో తెలుగు రీమేక్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. తమిళంలో కాజల్‌ అగర్వాల్‌, మలయాళంలో మంజిమా మోహన్‌ నటిస్తున్నారు. ఇకపోతే మిగిలిన భాషల్లో ఈ సినిమా షూటింగ్‌ ఎటువంటి అడ్డంకి లేకుండా సాఫీగా జరిగిపోతోంది. ఇక తెలుగు విషయానికి వస్తే, అన్నీ అడ్డంకులే. నీలకంఠ తెలుగు వెర్షన్‌ని తెరకెక్కిస్తుండగా, ఇటీవల కొన్ని కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవడం జరిగింది. 

దాంతో సందిగ్ధంలో పడిన ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు ప్రశాంత్‌ వర్మ చేతికి చిక్కినట్లుగా తెలుస్తోంది. కొత్త కథలనే సరికొత్త కథనంతో తెరకెక్కించగల సత్తా ఉన్నోడు ప్రశాంత్‌ అని తొలి సినిమాకే ప్రూవ్‌ చేసుకున్నాడు. అలాంటిది రీమేక్‌ చిత్రం ఆయనకి పెద్ద కష్టం కాదు. కానీ అలాంటి ప్రాజెక్ట్‌ చిక్కడమే అతని అదృష్టం. దాంతో ఈ ప్రపోజల్‌ రావడమే తరువాయి వెంటనే ఓకే అనేశాడనీ తెలుస్తోంది. 

ఇకపై ఏ అడ్డంకులు రాకుండా ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్‌ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో ప్రశాంత్‌ ఉన్నాడట. చూడాలి మరి ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో తెలుగు 'క్వీన్‌' ఎలా ఆకట్టుకుంటుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS