ప్రముఖ నిర్మాత కన్నుమూత

మరిన్ని వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ నిర్మాత D.శివప్రసాద్ ఇక లేరు.

వివరాల్లోకి వెళితే, గత కొంతకాలంగా హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఈరోజు ఉదయం 6.30గంటలకి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈమధ్యనే ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నట్టు సమాచారం.

ఇక నిర్మాతగా 1985 నుండి కామాక్షి మూవీస్ బ్యానర్ లో ఆయన చాలా మంచి చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా నాగార్జునతో ఎక్కువ చిత్రాలని నిర్మించిన నిర్మాతగా ఆయనకి ప్రత్యేకమైన పేరు ఉంది. ఆయన మృతిపట్ల చిత్రపరిశ్రమ సంతాపం తెలిపింది.

 

ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు. శివప్రసాద్ గారి అంత్యక్రియలకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. శివప్రసాద్ గారి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబానికి www.iQlikmovies.com తరపున ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS