గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతి రైతులు తమకు న్యాయం జరగాలని దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా ఈ పోరాటం మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతూ తమకు మద్దతుగా తెలుగు సినిమా హీరోలు ఉండాలని టాలీవుడ్ హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లో సూపర్ స్టార్ 'మహేష్ బాబు' ఇంటి ముందు 'జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి' దీక్షకు దిగారు. వారి డిమాండ్లు ఈ విధంగా ఉన్నట్టు సమాచారం.
*ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని డిమాండ్
*ఏపీ కి చెందిన సినిమా హీరోలు.. నటులు స్పందించాలని డిమాండ్
*ఈ రోజు నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామంటూ ప్రకటన
*వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రఅభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలి
*కర్నూలులో హైకోర్టు అమరావతి వైజాగ్ లో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలి
*ఏపీ కి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం కల్పించాలి
*ఏపీ పునర్విభజన చట్టంలోని విభజన హామీలు అమలు చేయాలి.
ఒక మహేష్ బాబునే కాదు అందరూ ప్రముఖ హీరోల ఇళ్ల ముందు ధర్నా చేస్తాం అని 'ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి' రాష్ట్ర అధ్యక్షుడు 'షేక్ జిలాని' తెలిపారు గత ఏడాది తమిళనాడు లో జల్లికట్టు పోరాటం జరిగినప్పుడు అక్కడి సూపర్ స్టార్లు అందరూ ప్రజలకు మద్దతుగా దీక్షలో కూర్చుని వారి డిమాండ్లను సాధించుకున్నారు ఆ సమయం లో మన హీరోలు కూడా వారికి మద్దతుగా నిలిచారు. మరి ఈ హీరోలు సొంత రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారో లేదో చూడాలి.