చేసిన తప్పే మళ్ళీ చేస్తున్న పూరీ జగన్నాథ్..!

మరిన్ని వార్తలు

భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా ఫెయిలైంది. అలా అని ఆ ఫెయిల్యూర్‌ని తలచుకుంటూ కూర్చుంటే మనలో టాలెంట్‌ ఎప్పుడు బయటకొచ్చేది అంటున్నాడు ప్రముఖ దర్శకుడు పూరీ. అందుకే ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మెహబూబా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

కానీ సక్సెస్‌ అయితే అందుకోలేకపోయింది. దాంతో పూరీ ఏమీ డిజప్పాయింట్‌ కాలేదు. ఎలాగైన సక్సెస్‌ అయ్యి చూపించాలనుకుంటున్నాడు. అందుకే తన నెక్ట్స్‌ సినిమాని త్వరలోనే పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేసేస్తున్నాడట. ఆల్రెడీ పూరీ తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలేట్టేశాడనీ సమాచారమ్‌. అంతే కాదు లొకేషన్స్‌ కూడా చూజ్‌ చేసి పెట్టేశాడట. ఈ సినిమాలో హీరో ఎవరనేదే కదా మీ డౌట్‌. ఈ సినిమా కూడా తన కొడుకు ఆకాష్‌ పూరీతోనే తెరకెక్కించబోతున్నాడు పూరీ జగన్నాధ్‌.

 

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌. డైరెక్టర్‌గా పూరీ ఎలాగూ ఫెయిలవుతున్నాడు. అనవసరంగా తన ఫెయిల్యూర్స్‌కి తన కొడుకుని బలి చేస్తున్నాడే అంటూ క్రిటిక్స్‌ నుండి విమర్శలు వస్తున్నాయి. ఆకాష్‌ మంచి నటుడు. చైల్డ్‌ ఆర్టిస్టుగానే ఆ విషయం ప్రూవ్‌ చేసుకున్నాడు. పూరీ టేకింగ్‌ నచ్చలేదు కానీ, 'మెహబూబా'లో కూడా ఆకాష్‌ చాలా బాగా నటించాడు అని కామెంట్స్‌ వచ్చాయి కూడా. అలాంటి ఈ తరుణంలో కొత్త డైరెక్టర్స్‌ చేతిలో ఆకాష్‌ని పెడితే, హీరోగా మరింత డెవలప్‌ అయ్యే అవకాశాలున్నాయి. అలాంటిది మళ్లీ కొడుకుతోనే పూరీ ఈ ప్రయోగాలేంటబ్బా.. అని అంటున్నారు. 

అయితే పూరీ పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ సారి చేయబోయే ప్రయత్నం అలా ఇలా ఉండదని చెబుతున్నట్లుగా ఉంది. చూడాలిక పూరీ, ఆకాష్‌ని ఈసారి ఏం చేస్తాడో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS