జాన్వీ కపూర్ని ఎలాగైనా సౌత్కి పరిచయం చేసే క్రెడిట్ తనకే దక్కాలని పూరీ జగన్నాధ్ తాపత్రయపడుతున్నాడు. అయితే, జాన్వీకపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ షెడ్యూల్స్తో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయి. వాటన్నింటినీ వదులకుని పూరీ కోసం వస్తుందా.? కష్టమే. కానీ, పూరీ ట్రైల్స్ చూస్తుంటే, జాన్వీని వదిలే ప్రశక్తే లేదని అర్ధమైపోతోంది. అందుకే పూరీ ఓ సరికొత్త ప్లాన్కి రంగం సిద్ధం చేస్తున్నాడట. మకాం మొత్తం ముంబయ్కి షిప్ట్ చేసేయాలనుకుంటున్నాడట. పూరీ తెరకెక్కించబోయే 'ఫైటర్' సినిమాకి పక్కా స్క్రిప్టు వర్క్ పూర్తయ్యిందని తాజా సమాచారం.
ఇక నటీనటుల సెలెక్షనే మిగిలి ఉంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, హీరోయిన్ పాత్రను కేవలం జాన్వీ కపూర్ని దృష్టిలో ఉంచుకునే ప్రిపేర్ చేశాడట పూరీ జగన్నాధ్. సో ఎంత కష్టమైనా తన సినిమాలో హీరోయిన్ జాన్వీనే అని ఫిక్సయిపోయాడు. ఇకపోతే, ఈ సినిమాని ప్యాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హస్తం ఈ సినిమాకి తోడవడంతో, టీమ్ మొత్తాన్నీ ముంబయ్కి షిఫ్ట్ చేసేందుకు బడ్జెట్ కాస్త అటూ ఇటూ అయినా పూరీకి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. 'సాహో' సినిమాలా, ముంబయ్ నటీనటులకే ఎక్కువగా ఈ సినిమాలో స్థానం కలిపించనున్నాడట పూరీ. సో ఇదంతా చూస్తుంటే, పూరీ డబుల్ ప్లానింగ్ చేస్తున్నట్లే ఉంది. ఓ పక్క ప్యాన్ ఇండియా మూవీ కల. మరోవైపు జాన్వీని ఇంట్రడ్యూస్ చేసే కల.. రెండూ ఎట్ ఏ టైమ్ తీరిపోనున్నాయన్న మాట. అయితే, బడ్జెట్ కాస్త ఎక్కువవుతుందేమో చూడాలి మరి.