'రాగల 24 గంటల్లో' ఏం జరగనుంది?

మరిన్ని వార్తలు

వాతావరణం అప్‌డేట్‌ చెప్పినట్లుగా సినిమా స్టోరీని రాగల 24 గంటల్లో ఏం జరగనుందో చెప్పనున్నారు తమ సినిమా 'రాగల 24 గంటల్లో' ద్వారా ఫిలిం మేకర్స్‌. సినిమా టైటిలే 'రాగల 24 గంటల్లో'. టైటిల్‌ చాలా ఇన్నోవేటివ్‌గా పెట్టారు. సినిమా ఏమో సస్పెన్స్‌ థ్రిల్లర్‌. మర్డరీ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఊహించని థ్రిల్లింగ్‌ అంశాలతో టైటిల్‌కి తగ్గట్లుగా ఆడియన్స్‌లో క్యూరియాసిటీ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నా మధ్య ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్‌ వదిలారు. టీజర్‌లో ఆర్టిస్టులందర్నీ బ్రీఫ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

 

మరో హీరోయిన్‌ ముస్కాన్‌ సేథి కీలక పాత్ర పోషిస్తోంది. తమిళ హీరో శ్రీరామ్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత సీనియర్‌ కమెడియన్‌ కృష్ణ భగవాన్‌ ఈ సినిమాలో ఇంపార్టెంట్‌ అండ్‌ డిఫరెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న కొన్ని సినిమాలు ఈ మధ్య బాగా ఆకట్టుకుంటున్నాయి.

టీజర్‌ స్టేజ్‌ నుండే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఆ స్థాయిలో ఈ సినిమా ఆసక్తి క్రియేట్‌ చేసిందో లేదో అనే విషయం పక్కన పెడితే, సినిమాలో అసలు విషయం ఏంటనేది అంతగా కనెక్ట్‌ కాలేదు. ఓ మర్డర్‌ మిస్టరీని చూపించబోతున్నారన్న విషయం మాత్రమే అర్ధమవుతోంది. చూడాలి మరి, జనానికి ఈ మిస్టరీని కనెక్ట్‌ చేయడంలో యూనిట్‌ ఎంత మేర సక్సెస్‌ అవుతుందో. ఈ సినిమా కోసం తొలిసారి థ్రిల్‌ చేస్తానంటోంది మన తెలుగమ్మాయి ఈషా రెబ్బ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS