రాశీఖన్నా స్వీట్‌ ఫిలాసఫీ

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ రాశీఖన్నా ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగిపోయేలా ఉంది. అమ్మడు ప్రస్తుతం గోపీచంద్‌ సినిమా 'ఆక్జిజన్‌'లో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది 'సుప్రీమ్‌'తో బిగ్గెస్ట్‌ హిట్‌ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాదిలో బంపర్‌ ఆఫర్స్‌ చేజిక్కించుకుంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమా 'జై లవ్‌ కుశ' లో అమ్మడు హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ కొట్టేసింది. కళ్యాణ్‌రామ్‌ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌ మీదికి వెళ్లనుండగా, ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో రాశీఖన్నాది కీలకపాత్రట. అలాగే తాజాగా సుకుమార్‌ - చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా అమ్మడే హీరోయిన్‌. ఈ సినిమాలో సమంత కూడా ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సమంతది పూర్తి హీరోయిన్‌ పాత్ర కాదని ప్రచారం జరుగుతోంది. అంటే ఈ సినిమాకి రాశీఖన్నానే మెయిన్‌ హీరోయిన్‌ కానుంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ తమిళం నుండి కూడా ఆఫర్స్‌ బాగానే వస్తున్నాయి. ఇలా ఈ ఏడాది ఈ భామ బాగానే అవకాశాలు దక్కించుకుంటోంది. అందుకే రాశీఖన్నా అంటోంది. ఎంత ఎదురు చూస్తే కెరీర్‌ అంత బాగుంటుంది అని. సక్సెస్‌లు వచ్చినా, కానీ ఆఫర్స్‌ దక్కించుకోవడంలో రేస్‌లో వెనకే ఉండిపోయింది ఈ భామ. కానీ ఇప్పుడు తను కూడా రేస్‌లో పరుగులు తీసే అవకాశం వచ్చింది. ఇక ఏ అవకాశాన్ని వదులకోకుండా తనలోని టాలెంట్‌ ఏంటో చూపిస్తానంటోంది. కీప్‌ ఇట్‌ అప్‌ రాశీఖన్నా. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS