15 నిమిషాల క్లైమాక్స్... రూ.50 కోట్ల ఖ‌ర్చు

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్ సినిమా `రాధే శ్యామ్` అప్ డేట్ల కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్ మొహం వాచిపోయేలా ఎదురు చూస్తున్నారు. ఈ విష‌యంలో యూవీ క్రియేషన్స్ పై గుర్రుగానే ఉన్నారు ఫ్యాన్స్‌. సంక్రాంతికి ఈసినిమాని విడుద‌ల చేస్తామ‌ని చెప్ప‌డం మిన‌హా.. మ‌రో అప్‌డేట్ రాలేదు. ప్ర‌మోష‌న్లు ఎప్ప‌టి నుంచి మొద‌లెడ‌తారో కూడా తెలీదు. క‌నీసం ఈలోగా ఓ చిన్నటీజ‌ర్ వ‌దిలినా ఫ్యాన్స్ కి సంతోష‌మే. ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాధేశ్యామ్ టీజ‌ర్ రాబోతోంద‌ని టాక్‌. అదే రోజు స‌లార్ కి సంబంధించిన అప్‌డేట్ కూడా వ‌స్తుంది.

 

అయితే ఇప్పుడు... రాధేశ్యామ్ గురించిన ఓ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే... ఈ సినిమా క్లైమాక్స్ చాలా భారీ ఎత్తున తీశార్ట‌. 15 నిమిషాలు పాటు సాగే ఈ క్లైమాక్స్ కోసం ఏకంగా రూ.50 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని టాక్‌. బ‌హుశా.. టాలీవుడ్ లోనే అత్యంత ఖ‌రీదైన క్లైమాక్స్ ఇదే కావొచ్చు. యూర‌ప్ బ్యాక్ గ్రౌండ్ లో జ‌రిగే క‌థ ఇది. క్లైమాక్స్ కూడా అక్క‌డే ప్లాన్ చేశారు. ఈ క్లైమాక్స్‌ని రెండు సార్లు తీశార్ట‌. అందుకే ఈ స్థాయిలో ఖ‌ర్చ‌యి ఉంటుంద‌ని అంటున్నారు. రాధేశ్యామ్ ఓ రొమాంటిక్ జ‌ర్నీ.యాక్ష‌న్ ఘ‌ట్టాల‌కు అంత‌గా స్కోప్‌లేదు. ప్ర‌భాస్ నుంచి అభిమానులు యాక్ష‌న్‌స‌న్నివేశాలే ఆశిస్తారు కాబ‌ట్టి... క్లైమాక్స్ లో భారీ యాక్ష‌న్ సీన్ ప్లాన్ చేశార్ట‌. అందుకే... ఇంత ఖర్చ‌యింద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS