హాస్పిటలో రజనీ.. ఫ్యాన్స్ కలవరం

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజనీకాంత్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ‘‘బీపీ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. బీపీని అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నాం. ఈ సమస్య తప్ప ఇతర ఇబ్బందులు ఏమీ లేవు.

 

రక్తపోటు అదుపులోకి రాగానే రజనీకాంత్‌ను డిశ్ఛార్జి చేస్తాం. అని అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు రజనీకాంత్‌ తన తదుపరి చిత్రం 'అన్నాత్తే' చిత్రీకరణ కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. అయితే చిత్రబృందంలో కొందరు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చిత్రీకరణ నిలిపేశారు. ఈ క్రమంలోనే రజనీకి కొవిడ్‌-19 పరీక్ష చేయగా నెగిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన గత కొన్నిరోజులుగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. తాజాగా రజనీ హాస్పిటల్ చేరడం అభిమానుల్లో కలకలం రేగింది. కొన్నాళ్ళుగా రజనీ ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి.

 

రజనీ ఇది వరకే అమెరికాలో వైద్యం తీసుకున్నారు. ఆ కోర్స్ ఇంకా కొనసాగుతుంది. అప్పుడప్పుడు ఆయన అమెరికా వెళ్లి వస్తుంటారు. మరి కొద్ది రోజుల్లో పార్టీ స్థాపన కూడా పెట్టుకున్నారు రజనీ. ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే యాక్టివ్ అయ్యారు. ఈలాంటి నేపధ్యంలో రజనీ ఆరోగ్య సమస్య కలవరపాటుకి గురి చేస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS