మరోసారి రజనీని మెప్పించిన డైరెక్టర్.

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈమధ్య గ్యాప్ లేకుండా వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో 'అన్నాతే' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే రజనీ మరో సినిమాకు ఈమధ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రజనీతో గతంలో 'పేట' సినిమాను తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్ రజనీని కలిసి ఓ ఆసక్తికరమైన కథ వినిపించారట. ఆయనకు కథ విపరీతంగా నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పారట.

 

ఈ సినిమాను 'అన్నాతే' కంప్లీట్ అయిన తర్వాత తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. కార్తీక్ ప్రస్తుతం ధనుష్ హీరోగా 'జగమే తందిరం'(తెలుగులో జగమే తంత్రం) అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సూపర్ స్టార్ సినిమాకు షిఫ్ట్ అవుతారట. రజనీ-కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో గతంలో తెరకెక్కిన 'పేట' బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. మరి రెండో సినిమాతో అయినా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS