చెర్రీ - బన్నీ మల్టీ స్టారర్ రానుందా?

మరిన్ని వార్తలు

గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీ మొత్తం మెగా కాంపౌండ్ వైపే చూస్తోంది. కారణం ఏపీ ఎన్నికల ముందు జరిగిన రచ్చ. ఎప్పుడు లేని విధంగా మెగా వర్సెస్ అల్లు అన్నట్టు సీన్ మారిపోయింది. దీన్ని యాంటీ మెగా ఫ్యామిలీ పెంచి పెద్ద చేసింది. వీటన్నిటికి చెక్ పెట్టేందుకు మెగా హీరోలు ముందుకు వచ్చారు. మెగా కాంపౌండ్ నుంచి రామ్ చరణ్. అల్లు ఫ్యామిలీ నుంచి బన్నీ ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ చేసేందుకు సిద్దమైనట్లు టాక్.  


ఎప్పుడు కృష్ణార్జునల్లా కలిసుండే చిరంజీవి, అల్లు అరవింద్‌ మధ్య దూరం పెరిగిందని, పొలిటికల్ వార్ కారణంగా పచ్చగా ఉండే రెండు కుటుంబాలు విడిపోయాయని మెగా ఫాన్స్ ఆందోళనలో ఉన్న ఈ టైం లో బన్నీ, చెర్రీ మల్టీ స్టారర్ వీరికి ఊరట నిచ్చింది. చెర్రీ గేమ్ చేంజెర్ మూవీ, బన్నీ పుష్ప 2 మూవీ రెండు డిసెంబరు లో రిలీజ్ అని ఫాన్స్ సతమవుతున్న వేళ ఒక క్లారిటీ వచ్చింది. అల్లు, మెగా ఫ్యామిలీ కలిసే ఉందని, బయట వారు అలా ప్రచారం చేస్తున్నారని, ఆలోచింప చేసింది. మెగా ఫాన్స్ ని ఏకతాటిపైకి తీసుకురావటానికి 400 కోట్ల భారీ బడ్జెట్‌ తో ఒక మల్టీ స్టారర్ ప్లాన్‌ చేసారని సమాచారం.


చెర్రీ, బన్నీ కలిసి ఇదివరకే వంశీ పైడిపల్లి దర్శకత్వం లో 'ఎవడు' మూవీలో నటించారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ల గా ఎదిగాక మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీని  గీతా ఆర్ట్స్ బ్యానర్‌ తో పాటు కొణిదల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాలని తీర్మానించుకున్నారని తెలుస్తోంది. 400 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా  స్థాయిలో ఈ మూవీ తెరకెక్కునుంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ డిసెంబర్‌లో ఉంటుందని, టాక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS