డార్లింగ్ తో మళ్లీ మాయ చేయనున్న త్రిష

మరిన్ని వార్తలు

వరుస హిట్లతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు ప్రభాస్. కల్కి మానియా ఇంకా తగ్గక ముందే 'రాజా సాబ్' షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ 2025 ఏప్రిల్ కి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో బిజీ కావటం వలన సలార్ 2 వాయిదా పడింది. దీనితో హను రాఘవ పూడితో ఒక మూవీ, సందీప్ వంగ తో స్పిరిట్ కి ఓకే చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి ఆ స్థాయి హీరోయిన్స్ లేరన్నది నిజం. ప్రభాస్ కటౌట్ కి కూడా ఏ హీరోయిన్ సరిపోవటం లేదు. దీనితో ప్రతిసారి డార్లింగ్ సినిమా అనగానే హీరోయిన్ ఎవరన్న చర్చ మొదలవుతోంది. ఇప్పుడు కూడా అంతే సందీప్ వంగా స్పిరిట్ కోసం ఏ హీరోయిన్ ని దించుతాడా అని ఎదురు చూస్తుంటే క్రేజీ అప్డేట్ వచ్చింది. 


ఏ బాలీవుడ్ హీరోయిన్నో, హాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతాడు అనుకుంటే కోలీవుడ్ హీరోయిన్ త్రిష పేరు వినిపిస్తోంది. ప్రభాస్, త్రిష జోడికి మంచి ఫాలోయింగ్ ఉంది. హ్యాట్రిక్ మూవీస్ చేసింది ఈ జోడి. వర్షం , పౌర్ణమి, బుజ్జిగాడు తో అలరించిన త్రిష పద్దెనిమిదేళ్ల తరవాత మళ్లీ ప్రభాస్ తో 'సై' అంటోంది. త్రిష కెరియర్ అయిపోయింది అన్న తరుణం లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిక్స్ అవుతోంది. చిరంజీవితో 'విశ్వంభర'. ఇప్పుడు  ప్రభాస్ తో సందీప్ వంగా మూవీ. ఈ మూవీతో త్రిష కెరియర్ కి ఇంకో నాలుగైదేళ్లు ఢోకా ఉండదని సినీవిశ్లేషకుల వాదన. 


ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది. ప్రభాస్‌-త్రిష హిట్‌ పెయిర్‌ ని మరోసారి హైలెట్ చేసే ఉద్దేశ్యం తోనే సందీప్ త్రిషని సంప్రదించినట్టు తెలుస్తోంది. త్రిష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో సాగే ఈ సినిమాలో హీరోతో పాటు విలన్ పాత్రలో కూడా ప్రభాస్ కనిపించబోతున్నారని సమాచారం. ఈ రెండు పాత్రలు చాలా బలంగా, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో ఉంటాయని టాక్. హీరోయిన్ పాత్ర చాలా హోమ్లీగా, డిగ్నిఫైడ్ గా ఉంటుందని, అందుకు త్రిష పర్ఫెక్ట్ ఛాయిస్ అని సందీప్ నమ్మకం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS