అమృతకు అండగా నిలిచిన సినీ పరిశ్రమ.!

మరిన్ని వార్తలు

అల్లు శిరీష్‌ హీరోగా నటించిన తొలి సినిమా 'గౌరవం' పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కింది. హీరో తన స్నేహితుడి ఆచూకి తెలుసుకునే ప్రయత్నంలోనే ఆ స్నేహితుడు, స్నేహితుడి లవర్‌ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుసుకుంటాడు. అది పరువు హత్య అని తెలిసి, ఆవేదన చెందుతాడు. స్నేహితులతో కలిసి ఆ పరువు హత్యకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. 

రియల్‌ లైఫ్‌లో ఓ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తోందిప్పుడు. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ అనే యువకున్ని దారుణంగా హతమార్చిన ఘటన తెలుగు సినీ ప్రముఖుల్ని కలచివేసింది. ప్రణయ్‌ భార్యకు తండ్రి అయిన మారుతీరావు ఈ హత్య చేయించాడు. ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా మంచు మనోజ్‌, రామ్‌, నిఖిల్‌ స్పందించారు. 

తాజాగా రామ్‌చరణ్‌ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాడు. ఏ సమాజంలో ఉన్నాం మనం.? అని ప్రశ్నించాడు. స్పందించింది తక్కువ మందే అయినా, సినీ ప్రముఖులు సామాజిక బాధ్యతను గుర్తెరిగి పరువు హత్యను ఖండించడాన్ని పలువురు అభినందిస్తున్నారు. జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌ అంటూ సోషల్‌ మీడియా నినదిస్తోంది. 

దేశమంతా ఇప్పుడిదే చర్చనీయాంశమైంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS