వరకట్న వేధింపులు: రంభకి సమన్లు

మరిన్ని వార్తలు

సినీ నటి రంభకి వరకట్న వేధింపుల కేసులో పోలీసులు సమన్లు జారీ చేయడం జరిగింది. విదేశాల్లో భర్తతో కలిసి ఉండటం కారణంగా ఆమెపై గతంలోనే కేసులు నమోదైనా సమన్లు అందించలేకపోయారు పోలీసులు. ఈ మధ్యన ఆమె స్వదేశానికి తిరిగిరావడం, ఓ టీవీ ఛానల్‌లో డాన్స్‌ ప్రోగ్రామ్‌కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండడంతో ఆమెకు పోలీసులు సమన్లు అందించారు. రంభ సోదరుడు శ్రీనివాసరావు 1990లో పల్లవిని వివాహమాడారు. అయితే 2014 నుంచి అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఆమె తన భర్త మీదా అత్త మామలతోపాటు ఆడపడుచు అయిన రంభ మీద ఆరోపణలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు రంభ సహా, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ మధ్యనే రంభ తన భర్తతో కూడా వివాదాలున్నాయంటూ వార్తల్లోకెక్కింది. భర్తని విడిచి పెట్టి, పిల్లలతో పాటు స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈలోగా ఈ కేసుల గొడవేంటా అంటూ రంభ విసుగు చెందుతోంది. ఇది ఎప్పుడో రెండేళ్ల క్రితం కేసు. అది కొత్తగా ఇప్పుడు మళ్లీ బయటికి వచ్చింది. ఈ డిస్ట్రబెన్స్‌తో రంభ ఒకింత మనస్తాపానికి గురవుతోంది. ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న డాన్స్‌ ప్రోగ్రాంలో ఎంతో అందంగా యాక్టివ్‌గా కనిపిస్తోంది. ఈ రకంగా చాన్నాళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ తెర ముందుకు వస్తోన్న ముద్దుగుమ్మ రంభపై ఈ రకమైన ఆరోపణలు రావడం విచారకరమే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS