Rana Daggubati: ఇదే ఫైనల్.. రూటు మార్చేస్తున్న రానా

మరిన్ని వార్తలు

రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో రానా స్పీచ్ ఆసక్తికరంగా సాగింది. ఇదే తన చివరి ప్రయోగమని ఇకపై ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తామని వెల్లడించాడు రానా.

 

రానా హీరోయిజం అనే లెక్కలు వేసుకోవడం లేదు. మంచి పాత్రలన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ దారిలోనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు విరాట పర్వం కూడా సాయి పల్లవి సినిమా అనే ప్రమోట్ చేస్తున్నారు తప్పా రానా సినిమా అని చెప్పడం లేదు. రానాకి కూడ ఇదే ఇష్టం. ఐతే ఈ సినిమా చేస్తున్నపుడు ఇంకెంత కాలం ఇలాంటి సినిమాలు చేస్తావని చాలా మంది అభిమానులు అడిగారట. అందుకే రానా కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రయోగాలు జోలికి పోకుండా కమర్షియల్ సినిమాలు చేసి అభిమానులని అలరించాలని నిర్ణయించున్న రానా విరాట పర్వం వేదికపైనే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS