కరోనా కారణంగా పెద్ద పెద్ద సినిమాలే ఎక్కడికక్కడ షూటింగ్లు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కారణంగా తన ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, యాంకర్ రష్మి మాత్రం నేను షూటింగ్లు ఆపను.. అంటోంది. కామెడీగా ఉందా.? అసలు వివరాల్లోకి వెళదాం. కరోనాకి పారాసిట్మాల్ రూపంలో మనకు మందుంది.. అంటూ మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసెంబ్లీలో సూచన చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ట్యాగ్ చేస్తూ, మన యాంకర్ రష్మి, ప్రియమైన మోడీగారూ మీరూ ఈ విషయంలో కాస్త పునరాలోచన చేయాలని సూచిస్తూ ట్వీటినట్లు అర్ధమవుతోంది.
‘కరోనాకి మందు లేదంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అర్ధం పర్ధం లేని భయాందోళనలు కలిగిస్తున్నారు. కానీ, ‘మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ పారాసిట్మాల్ రూపంలో ఈ వైరస్కి మందుంది.. అంటూ సూచించిన సంగతి తెలిసిందే. అయితే, రష్మికి ఇందులోని సారాంశం నిజంగానే అర్ధమయ్యే ఈ పోస్ట్ పెట్టిందా.? లేక అచ్చ తెలుగులో మన ముఖ్యమంత్రులు సంభాషించడం వల్ల, అర్ధమయ్యీ అవ్వక ఇలా రెస్పాండ్ అయ్యిందా.? లేక తన స్టైల్లో సెటైరికల్గా పోస్ట్ చేసిందా.? అనే విషయం తెలీదు కానీ, ఈ ట్వీట్తో నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతోంది రష్మి. ఫుల్గా రష్మిని ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఆ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవే షూటింగ్ ఆపేశారు. నీకెందుకు.. నువ్వు కూడా షూటింగ్స్ ఆపేసేయ్.. అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ కామెంట్కే రష్మి పై విధంగా స్పందించింది. నేను మానేస్తే నిర్మాతలు ఒప్పుకోరు.. మెగాస్టార్ అంతటి వ్యక్తి కాబట్టి, ఆయన మానేస్తే, అందరూ మానేస్తారు.. కానీ, నేను మానేయడం కుదరదు.. అని రష్మి చేసిన ట్వీట్ కాస్తా ఇలా డబుల్ మీనింగ్ కి వచ్చేసింది పాపం.