సైలెంట్‌గా, రష్మీ వైలెంట్‌ అప్పీల్‌!

By iQlikMovies - August 01, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ బ్యూటీ రష్మీ సైలెంట్‌ ఎంట్రీ షురూ అయ్యింది. బుల్లితెరపై యాంకర్‌గా బిజీగా ఉన్న రష్మీ, తాజాగా పెద్ద తెరపై ఎంట్రీ ఇవ్వబోతోంది. రష్మి నటించిన తాజా చిత్రం 'శివరంజని' ఆగస్ట్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకూ ఈ సినిమా గురించి ఎక్కడా సౌండ్‌ లేదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ ఎప్పుడూ ఈ సినిమా గురించి ప్రస్థావించలేదు. దాంతో ఈ సినిమా గురించి ఎవరికీ తెలియలేదింతవరకూ. కానీ, అనూహ్యంగా ఆగస్ట్‌ 2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుని, 'శివరంజని' రేపే విడుదల.. అంటూ ట్యాగ్‌లైన్‌తో రష్మీ దూసుకొస్తోంది.

 

నందూ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, సినిమాని అడల్ట్‌ కంటెంట్‌ మూవీగా ప్రమోట్‌ చేస్తున్నారు. బీభత్సమైన గ్లామర్‌, రొమాంటిక్‌ సీన్స్‌తో సినిమాని తెగ ప్రమోట్‌ చేసేస్తున్నారు. నిజానికి రేపు విడుదలయ్యే సినిమాల్లో ఇంతవరకూ టాక్‌లో ఉన్నవి బెల్లంకొండ 'రాక్షసుడు', కార్తికేయ 'గుణ 369' మాత్రమే.

 

కానీ, అనూహ్యంగా రష్మీ వైలెంట్‌ ఎంట్రీ ఇచ్చింది. వన్‌ డే ప్రమోషన్సే అయినా, కానీ, 'శివరంజని' బాగా కనెక్ట్‌ అవుతోంది. అందుకు కారణం ప్రోమోలోని హాట్‌ సీన్సే కావచ్చు. అందులోనూ రష్మీకి హాట్‌ హాట్‌ ఫాలోయింగ్‌ ఎలాగూ ఉండనే ఉంది. సో కళాపోషకులు ఈ వారం ఎంజాయ్‌ చేయడానికి కట్టుదిట్టమైన కంటెంట్‌తో 'శివరంజని'గా రష్మీ సిద్ధమైందన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS