ఆ సినిమాల్లో నటించను: రష్మిక సంచలన వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు

కన్నడ కస్తూరి రష్మిక టాలీవుడ్‌లో జోరుగా దూసుకెళ్తోంది. గ్లామర్‌తో పని లేకుండానే స్టార్స్‌ సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. అయితే, రష్మిక మాత్రం ఈ సినిమా తనకు ఎప్పటికీ ప్రత్యేకమే అంటోంది. హీరోతో సమానమైన పాత్రలో నటించనాననీ, తనకు కావల్సింది ఇదేననీ అంటోంది.

 

హీరోయన్స్‌ గ్లామర్‌ని మాత్రమే చూపించి, పాటలకి పరిమితం చేసే కథలను తాను అస్సలు ఎంచుకోననీ అలాంటి సినిమాల్లో నటించేందుకు ఎంత రెమ్యునరేషన్‌ ఇచ్చినా సున్నితంగా తిరస్కరిస్తాననీ చెప్పుకొచ్చింది. అందుకే కోలీవుడ్‌ నుండి కొన్ని ఆఫర్లు తిరస్కరించాననీ రష్మిక చెప్పుకొచ్చింది. అయితే, మహేష్‌బాబు సినిమాలో రష్మిక పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండే ఉండాలి. లేకుంటే, ఆమె ఒప్పుకుని ఉండేదే కాదు కదా.

 

ఇకపోతే, మహేష్‌ డైలాగ్‌నే ఈమె ఫాలో చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా..? అనే మహేష్‌ డైలాగ్‌ని, ఎన్ని సినిమాల్లో నటించామన్నది కాదు, ఎంత మంచి సినిమాల్లో నటించామన్నదే లెక్క అని రష్మిక తన స్టైల్‌లో చెప్పింది. ఎంతైనా కన్నడ కుట్టీ కదా. కెరీర్‌ మీద ఆ మాత్రం క్లారిటీ ఉంటుంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS