మహేష్‌తో రష్మిక ఆ విషయంలో చాలా భయపడిందట.!

మరిన్ని వార్తలు

కన్నడ కుట్టీ రష్మికా మండన్నా ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు..' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్‌ మొదట్లోనే మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరోతో జత కట్టడమంటే నిజంగా రష్మిక అదృష్టమే. ఈ అవకాశం దక్కినందుకు తానెంతో సంతోషంగా ఉన్నానని రష్మిక చాలా సార్లు చెప్పింది. తాజాగా సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని రష్మిక ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. తొలి షూటింగ్‌ సన్నివేశానికి చాలా నెర్వస్‌ ఫీలయ్యిందట. కానీ, మహేష్‌ బాబు తన స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనీ, తనకు తెలియని విషయాల్ని తెలియచెబుతూ, చాలా కంఫర్ట్‌బుల్‌గా బిహేవ్‌ చేశారనీ రష్మిక చెప్పుకొచ్చింది. అయితే, మహేష్‌తో రొమాంటిక్‌ సీన్స్‌ చేసేటప్పుడు చాలా చాలా భయపడిందట రష్మిక. ఆ విషయంలో సూపర్‌ స్టార్‌ చాలా హుందాగా వ్యవహరించారని చెబుతోంది.

 

ఇంతవరకూ విడుదలైన 'సరిలేరు..' ప్రచార చిత్రాల్లో రష్మిక పెద్దగా కనిపించింది లేదు. టీజర్‌లోనూ రష్మికకు చోటు దక్కలేదు. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన 'సూర్యుడివో..చంద్రుడివో..' సాంగ్‌ వీడియోలోనూ రష్మిక కనిపించలేదు. దాంతో రష్మిక ఫ్యాన్స్‌ చాలా ఫీలవుతున్నారు. ఫ్యాన్స్‌ని ఖుషీ చేసేందుకు త్వరలోనే రష్మికకు సంబంధించిన స్పెషల్‌ టీజర్‌ ఒకటి రిలీజ్‌ చేసే యోచనలో 'సరిలేరు..' టీమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS