మాజీ తో సై అంటున్న మందన్న!

By iQlikMovies - June 14, 2020 - 10:42 AM IST

మరిన్ని వార్తలు

లవ్ జంటల బ్రేకప్పులు ఈమధ్య చాలా కామన్ అయ్యాయి. ఇలియనా, శృతి హాసన్, రష్మిక మందన్న.. ఇలా చెప్పుకుంటూ పోతే తమ బాయ్ ఫ్రెండ్స్ తో కటీఫ్ చెప్పుకున్న హీరోయిన్ల లిస్టు చాలా పెద్దదే అవుతుంది. ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత హీరోయిన్లు తమ మాజీలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపరు. బాలీవుడ్ లో అయితే బ్రేకప్ అయిన తర్వాత మాజీ లవర్లు కలిసి నటించిన సందర్బాలు ఉన్నాయి కానీ సౌత్ లో తక్కువే.

 

అయితే రష్మిక మందన్న మాత్రం తన మాజీ లవర్ రక్షిత్ శెట్టితో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదంటోంది. అప్పట్లో రష్మిక-రక్షిత్ ల ప్రేమ నిశ్చితార్థం వరకూ వెళ్లింది. తర్వాతేమైందో తెలియదు కానీ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. ఇద్దరూ ఎవరి కెరీర్లో వారు బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ నటించిన సినిమా 'కిరిక్ పార్టీ' కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. రక్షిత్ ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ను తీసుకుందామని అంటున్నాడట. అయితే నిర్మాతలు మాత్రం రష్మిక అయితే బాగుంటుందని అంటున్నారట. ఈమధ్య వారు రష్మికకు ఈ విషయం చెప్పడంతో రక్షిత్ తో కలిసి నటించేందుకు తనకెలాంటి ఇబ్బంది లేదని చెప్పిందట. దీంతో నిర్మాతలు రక్షిత్ ను ఒప్పించే పనిలో బిజీగా ఉన్నారట.

 

ఒకవేళ ఇద్దరూ కలిసి నటిస్తే ఈ సినిమా కన్నడలో క్రేజీ ప్రాజెక్టుగా మారుతుంది. ఎందుకంటే మాజీ లవర్లు ఇలా కలిసి నటిస్తే జనాలకు ఆసక్తి చా..లా ఎక్కువగా ఉంటుంది కదా. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ కొత్త సినిమా 'పుష్ప' లో హీరోయిన్ గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS