మాస్‌ మహారాజ్‌ 'రవితేజ' ట్రిపుల్‌ ధమాకా.!

మరిన్ని వార్తలు

రవితేజ ట్రిపుల్‌ రోల్‌లో వస్తోన్న చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'. లేటెస్టుగా ఈ సినిమా నుండి టీజర్‌ వదిలారు. టీజర్‌ చాలా బాగుంది. విజువల్స్‌ రిచ్‌గా కనిపిస్తున్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకునేలా ఉంది. రవితేజ మూడు గెటప్పులూ క్లియర్‌గా రివీల్‌ చేశారు ఈ టీజర్‌లో.

 

యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా కనిపిస్తోంది. శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత ఇలియానా ఈ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. టీజర్‌లో ఇలియానా చాలా బొద్దుగా ముద్దుగా కనిపిస్తోంది. రవితేజ మూడు గెటప్పులూ సూపర్బ్‌ అనిపించేలా ఉన్నాయి. గతంలో శీను వైట్ల - రవితేజ కాంబినేషన్‌లో 'వెంకీ', 'దుబాయ్‌ శీను' తదితర చిత్రాలు వచ్చాయి. 

కానీ వాటిన్నింటికీ ఈ చిత్రం భిన్నంగా ఉండేలా ఉంది టీజర్‌ని బట్టి చూస్తే. 'రాజా ది గ్రేట్‌' సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన రవితేజకి ఈ సినిమా మంచి హిట్‌ ఇస్తుందని టీజర్‌ ని బట్టి అర్ధమవుతోంది. 'రంగస్థలం' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా ఈ సినిమా రూపొందిందని టీజర్‌లో కట్‌ చేసిన రిచ్‌ విజువల్స్‌ చెప్పకనే చెప్పేస్తున్నాయి. 

పోస్టర్స్‌తో స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ రేకెత్తించిన ఈ మూవీపై అంచనాల్ని లేటెస్ట్‌ టీజర్‌ నెక్ట్స్‌ లెవల్‌కి చేరేలా చేసింది. నవంబర్‌ 16న 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS