'ఆర్ఆర్ఆర్'లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రత్యేకమట !

మరిన్ని వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో ప్రత్యర్థుల పై చేసే మొదటి ఫైట్ సీన్స్ ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే వస్తాయని.. అడవిలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని.. ముఖ్యంగా తారక్ - చరణ్ ల మధ్య అనుబంధం కూడా ఈ సీక్వెన్స్ నుంచే మరో స్థాయికి వెళ్తుందని తెలుస్తుంది.

 

ఇప్పటికే 70% షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటుల్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో ప్రధానమైన విలన్ పాత్రల కోసం ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. మొత్తానికి ఈ ఎంపికను చూస్తే రాజమౌళి ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడని అనిపిస్తోంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు.

 

ఆ కసరత్తులను ఇంకా కంటిన్యూ చేస్తున్నాడట. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'బాహుబలి' తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS