లాక్ డౌన్ నుంచి షూటింగులకు మినహాయింపు ఇవ్వగానే 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ మొదలెడదామని అనుకుంది చిత్రబృందం. కానీ హైదరాబాద్లో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేకపోవడంతో, ఆ ప్రతిపాదన పక్కన పెట్టింది. నిజానికి పూణెలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అది కూడా వర్కవుట్ కాలేదు. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ వేసి, అందులో షూటింగ్ చేద్దామనుకున్నారు.
కానీ ఇప్పటికిప్పుడు ఓ సెట్ వేయడం కుదరని పని. అందుకే అవుడ్డోర్ లొకేషన్లోనే షూటింగ్ మొదలెట్టాలన్న ఆలోచనకు వచ్చారిప్పుడు. అందుకోసం నల్లొండ కోటని ఫిక్స్ చేశారు. నల్లొండ కోటలో `ఆర్.ఆర్.ఆర్`కి సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించే అవకాశం ఉంది. అయితే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్లు పాలు పంచుకునే అవకాశం లేదు. వాళ్లు లేని సన్నివేశాల్ని ఇక్కడ తీయబోతున్నార్ట. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తారని, అప్పుడే ప్రధాన షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది.