ప్రభాస్ `సాహో`లో ఎన్నెన్నో ఆకర్షణలు. తెలుగునాట భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. బాలీవుడ్ సినీ ప్రముఖులు, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ శ్రద్దా కపూర్ని కథానాయికగా సందడి చేయనుంది. ఇప్పుడు మరో బాలీవుడ్ భామని రంగంలోకి దింపినట్టు సమాచారం. `సాహో`లో మాస్కి కిర్రెక్కించే ఐటెమ్ సాంగ్ ఉంది.
ఈ పాట ఎవరితో చేయించాలా? అని చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోంది. కాజల్, ప్రగ్వా జైస్వాల్ లాంటి పేర్లు బయటకు వచ్చాయి. కాకపోతే... ఐటెమ్ భామనీ బాలీవుడ్ నుంచే దిగుమతి చేయాలని చిత్రబృందం భావిస్తోందని తేలింది. బాలీవుడ్ ఐటెమ్ సోయగం జాక్వెలెన్ ఫెర్నాండేజ్ని ఈ పాట కోసం ఎంచుకున్నట్టు సమాచారం అందుతోంది.
త్వరలోనే ఈ పాటని హైదరాబాద్ లో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రియాలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడి నుంచి తిరిగొచ్చాకే ఐటెమ్ పాటని చిత్రీకరిస్తారు.