మెగా మేనల్లుడు జోరు మీదున్నాడు.!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ మాంచి హుషారు మీదున్నాడు. తాజా చిత్రం 'చిత్రలహరి'తో ఖచ్చితంగా విజయం అందుకుంటానని కాన్పిడెంట్‌గా కనిపిస్తున్నాడు. ఈ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచాడు.

 

విచ్చలవిడిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇంటర్వ్యూల్లో సినిమాకి సంబంధించిన పలు ఆశక్తికరమైన అంశాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. సీకింగ్‌ సక్సెస్‌.. అనే కాన్సెప్ట్‌తో రూపొందిన 'చిత్రలహరి'కి ప్రీ రిలీజ్‌ బజ్‌ చాలా బాగుంది. ఇకపోతే తేజు విషయానికి వస్తే, 'సుప్రీమ్‌'తో మేసివ్‌ హిట్‌ కొట్టాడు. సుప్రీమ్‌ తర్వాత చెప్పుకోదగ్గ హిట్‌ లేదు తేజుకి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆధ్యంతం ఆశక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగనుందని ప్రచార చిత్రాల ద్వారా తెలిసింది. వెరీ లేటెస్ట్‌గా అందుతున్న సమాచారమ్‌ ప్రకారం సినిమాపై పోజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. తొలి షోకే పోజిటివ్‌ టాక్‌ వచ్చిందంటే, ఈ వీకెండ్‌ని బాగానే క్యాష్‌ చేసుకుంటాడు తేజు.

 

కళ్యాణీ ప్రియదర్శిని, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్‌, వెన్నెల కిషోర్‌, పోసాని తదతరులు మంచి పాత్రలను పోషించారు. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS