తేజ్‌ - అనుపమా రెడీ అయిపోయారు

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ - అనుపమా పరమేశ్వరన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'తేజ్‌ ఐ లవ్‌ యూ'. లవ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లవ్‌ స్టోరీలకు పెట్టింది పేరైన కరుణాకరన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. 

ప్యారిస్‌లో హీరో, హీరోయిన్స్‌ మధ్య రెండు రొమాంటిక్‌ సాంగ్స్‌ని చిత్రీకరించారు. దాంతో సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తయ్యింది. ఇక సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. తొలిసారిగా తేజు, అనుపమా జత కడుతోన్న సినిమా ఇది. ఇంతవరకూ విడుదలైన పోస్టర్స్‌, ప్రోమోస్‌ స్వీట్‌ స్వీట్‌ రొమాంటిక్‌ ఫీల్‌నిస్తున్నాయి. ముఖ్యంగా అనుపమా తన క్యూట్‌ లుక్స్‌తో బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. 

'శతమానం భవతి' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనుపమాకు తర్వాత రామ్‌తో నటించిన 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమా ఆశించిన రిజల్ట్‌నివ్వలేదు. ఆ తర్వాత అనుపమా నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. మరోవైపు తేజుకీ ఈ సినిమా సక్సెస్‌ ఎంతో అవసరం. ఇటీవల వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు తేజు. సో 'తేజ్‌ ఐ లవ్‌ యూ' అంటూ తన పేరునే టైటిల్‌గా పెట్టుకుని ఫుల్‌ జోష్‌తో వచ్చేస్తున్నాడు. డైరెక్టర్‌గా హిట్‌ లవ్‌ స్టోరీల బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న కరుణాకరన్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు తేజు. పోస్టర్స్‌లో తేజు మేనమామ పవన్‌ కళ్యాణ్‌లా రొమాంటిక్‌ చూపులతో చంపేస్తున్నాడు. 

చూడాలి మరి ఏం చేస్తాడో. సి.సి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS