తేజు కొత్త సినిమా ప్రారంభం.!

మరిన్ని వార్తలు

‘ప్రస్థానం’ వంటి విలక్షణ సినిమాతో ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు దేవకట్టా డైరెక్షన్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఓ సినిమాకి కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్‌ పను జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ఈ రోజు హైద్రాబాద్‌ ఫిలిం నగర్‌ టెంపుల్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్‌ అయ్యింది. ఈ పూజా కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిధిగా విచ్చేశారు. అల్లు అరవింద్‌, వంశీ పైడిపల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీరియస్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తేజుకి జోడీగా నివేదా పేతురాజ్‌ నటిస్తోంది. మణిశర్మ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమాకి భగవాన్‌, పుల్లారావ్‌ నిర్మాతలు.

 

ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. కాగా, ‘చిత్రలహరి’, ప్రతిరోజూ పండగే’ మూవీస్‌తో వరుస హిట్లు కొట్టి సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్‌ స్వింగ్‌లో ఉన్నాడు ప్రస్తుతం. ఇదే జోరులో వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నాడు. తేజు నటిస్తున్న ‘సోలో బతుకే సో బెటర్‌’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS