మరో సినిమాకు పచ్చజెండా ఊపిన మెగా హీరో

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' సినిమాతో హిట్ సాధించి సూపర్ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తేజు నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' ఈ వేసవిలోనే విడుదల కావాలి కానీ థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. ఇదిలా ఉంటే తేజు ఈమధ్య ఓ కొత్త సినిమాకు పచ్చ జెండా ఊపినట్టు టాక్ వినిపిస్తోంది.

 

ఈమధ్య గోపాల్ అనే నూతన దర్శకుడు తేజుకు 'భగవద్గీత సాక్షిగా' అనే ఓ కొత్త కథ వినిపించాడట. కథ డిఫరెంట్ గా ఉండడంతో తేజు సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. ఈ కథను మెగాస్టార్ చిరంజీవికి కూడా వినిపించారన సమాచారం. కథ ఆయనకు కూడా నచ్చిందని, అయితే విషాదాంతం కాకుండా సుఖాంతం అయితే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చే అవకాశం ఉంటుందని సూచించారట.

 

తేజు 'సోలో బ్రతుకే సో బెటర్' తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకు ఎక్కువ బడ్జెట్ అవసరం అవుతుందట. ఇదిలా ఉంటే నూతన దర్శకుడి సినిమా తక్కువ బడ్జెట్లో, తక్కువ మంది నటీనటులు టెక్నిషియన్లతో పూర్తి చేసే అవకాశం ఉందని అందుకే మొదట ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS