'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. తొలి సినిమాతోనే సమ్థింగ్ డిఫరెంట్ అనిపించుకుంది. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ, తన టాలెంట్ను చాటుకుంటోంది. ప్రస్తుతం తనను హీరోయిన్గా పరిచయం చేసిన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో 'లవ్స్టోరీ' అను చిత్రంలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు రానాతో 'విరాట పర్వం' సినిమాలోనూ సాయి పల్లవి పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించనుంది. ఇక తాజాగా మన మలయాళ కుట్టి చేతిలో మరో ప్రాజెక్ట్ వచ్చి చేరిందని తెలుస్తోంది.
నాని హీరోగా 'ట్యాక్సీవాలా' డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా సాయిపల్లవి పేరు పరిశీలిస్తున్నారట. గతంలో నానితో కలిసి సాయి పల్లవి, 'ఎంసీఏ' చిత్రంలో నటించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. సాయి పల్లవి వంటి హీరోయిన్తో నటించడం చాలా బాగుంటుందనీ, వెరీ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి.. అంటూ అప్పట్లో నానితో తెగ మెప్పు పొందింది ఈ మలర్ బ్యూటీ. 'ఎంసీఏ'లో వీరిద్దరి జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. సో మరోసారి ఈ జంట జత కడుతుందంటే ఫ్యాన్స్కి పండగే. అయితే, అధికారిక ప్రకటన కోసం కొంత కాలం వేచి చూడాలి మరి. ప్రస్తుతం నాని 'వి' చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే 'టక్ జగదీష్' అను కొత్త చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో పూర్తి చేశాడు. ఈ సినిమా పూర్తి కాగానే, తాజా ప్రాజెక్ట్పై దృష్టి పెట్టనున్నాడు నాని.