ఆ రీమేక్‌లో సాయి పల్లవి .?

మరిన్ని వార్తలు

నితిన్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘అంధాదున్‌’ తెలుగులో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హిందీలో అయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే జంటగా నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, నేషనల్‌ అవార్డు దక్కించుకుంది. తెలుగు వెర్షన్‌కొచ్చేసరికి కాస్టింగ్‌ పరంగా మేల్‌ లీడ్‌ కోసం నితిన్‌ ఎంపిక సరైనదే అని ముందే పోజిటివ్‌ వైబ్స్‌ రావడం సినిమాకి కలిసొచ్చే అంశమే.

 

అంధుడి పాత్రకు నితిన్‌ న్యాయం చేయగలడన్న నమ్మకం అందరిలోనూ ఉంది. దాంతో పాటు, ఇటీవల ‘భీష్మ’ సినిమాతో హిట్‌ కొట్టి ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తున్నాడు నితిన్‌. ఇలా ఉంటే, ఫిమేల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన రాధికా ఆప్టే పాత్రకు తెలుగులో ఎవరిని తీసుకోవాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్‌ ఉండగా, మలర్‌ బ్యూటీ సాయి పల్లవి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో, సాయి పల్లవి ఐతే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలదని భావిస్తున్నారట. సో సాయి పల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, నితిన్‌ ` సాయి పల్లవి కాంబినేషన్‌ ఫ్రెష్‌గా తెరపై సందడి చేయనుందన్న మాట. అంతేకాదు, సాయి పల్లవి అప్పియరెన్స్‌తో సినిమా స్థాయి నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరుకుంటుందనడం అతిశయోక్తి కాదేమో. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS