నాకు నేనే పోటీ అంటోన్న మలర్‌ బ్యూటీ

మరిన్ని వార్తలు

'ఫిదా' చిత్రంతో తెరంగేట్రం చేసి తొలి సినిమాకే యాక్టింగ్‌ టాలెంట్‌తో పాటు తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుని తానేంటో ప్రూవ్‌ చేసుకుంది. అతి క్లిష్టమైన తెలంగాణా యాసలో మాట్లాడి తెలంగాణా ప్రజలకే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్ని ఇట్టే దోచేసింది. ఆల్రెడీ మలయాళ 'ప్రేమమ్‌' సినిమాతోనే టాలీవుడ్‌లో కూడా ఈమె పేరు మార్మోగిపోయింది. ఇకపోతే, టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాక సక్సెస్‌ మీద సక్సెస్‌లు కొడుతూ, రెండు సినిమాలకే సూపర్‌ పాపులారిటీ సంపాదించుకుంది.

పాపులారిటీతో పాటు, అమ్మడిపై విమర్శలు, గాసిప్స్‌ కూడా ఎక్కువే ప్రచారమయ్యాయి. అయినా కానీ, అవేమీ పట్టించుకోకుండా, కెరీర్‌ని చక్కగా బిల్డప్‌ చేసుకుంటూ ముందుకు సాగుతోంది సాయి పల్లవి. తెలుగులో నానితో 'ఎంసీఏ' సినిమా తర్వాత నాగశౌర్యతో బైలింగ్వల్‌ మూవీ 'కణం'లో నటించింది. ఆ తర్వాత ఇప్పుడు శర్వానంద్‌తో 'పడి పడి లేచె మనసు' చిత్రంలో నటిస్తోంది. ఇటు తెలుగులో సినిమాలు చేస్తూనే, అటు తమిళంలోనూ స్టార్‌ హీరోలతో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది.

అక్కడ స్టార్‌ హీరోల్లో ఒకరైన సూర్యతో ఓ సినిమాలో నటిస్తోంది. మరో స్టార్‌ హీరో కమ్‌ నిర్మాత అయిన ధనుష్‌తో 'మారి 2' చిత్రంలోనూ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా గాసిప్స్‌, విమర్శలు వెంటాడుతున్నా, కానీ తన దారి తనదే, తాను ఏ హీరోయిన్‌కీ పోటీ కాదనీ, తనకు సూటయ్యే పాత్రలు, మనసుకు నచ్చిన కథలతో సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ పోతాననీ స్ట్రెయిట్‌గా చెప్పేస్తోంది ముద్దుగుమ్మ సాయిపల్లవి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS