'మహానటి' ముచ్చట మొదలైంది

మరిన్ని వార్తలు

అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుకతోన్న చిత్రం 'మహానటి'. ఈ సినిమా టాలీవుడ్‌కే కాదు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు కూడా ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా చరిత్రను గుర్తు చేసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. అందుకే భారీ స్టార్‌ కాస్టింగ్‌తో అందులోనూ ఈ తరం నటీ నటులతో ఆ తరాన్ని తలపింపచేసేలా 'మహానటి' మన ముందుకు రాబోతోంది. తాజాగా సమంత, విజయ్‌ ఆంటోనీల పాత్రల పరిచయాలు అయిపోయాయి. 'మధురవాణి' అనే జర్నలిస్టు పాత్రలో సమంత నటిస్తోంది.

విజయ్‌ ఆంటోనీ పాత్ర కూడా డిఫరెంట్‌గా ఉంది. మెళ్లో కెమెరా వేసుకుని, ఆ కాలం నాటి స్కూటర్‌లో తలపై హెల్మెట్‌ పట్టుకుని అచ్చం అలనాటి కాలం నాటి వ్యక్తిలాగే కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వారిలో ఎవరెవరు ఏ ఏ పాత్రలు పోషిస్తున్నారనే విషయం తెలియాలంటే ఇంకెంతో టైం పట్టదండోయ్‌. ఈ నెల 14న 'మహానటి' టీజర్‌ విడుదల కాబోతోంది. 'దర్శిని' పేరుతో ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు.

టీజర్‌ వచ్చిందంటే చాలా వరకూ పాత్రల విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. అందుకే టీజర్‌ కోసం అంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, దుల్కర్‌ సల్మాన్‌, నాగచైతన్య, ప్రకాష్‌రాజ్‌, షాలినీ పాండే, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేష్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న 'మహానటి' చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS