'ఈగో' రెడ్డితో అక్కినేని బుల్లోడి పాట్లు

మరిన్ని వార్తలు

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. మారుతి సినిమాలంటే ఈ మధ్య హీరోకి ఏదో ఒక లోపం గుర్తొస్తోంది. అయితే ఈ సారి ఆ లోపం హీరోయిన్‌కి పెట్టినట్లు తెలుస్తోంది. లేటెస్టుగా విడుదలైన టీజర్‌ చూస్తుంటే, ఈ విషయం అర్ధమవుతోంది.

 

నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అత్త పాత్రలో శివగామి రమ్యకృష్ణ నటిస్తోంది. అయితే ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్‌ లోపమేంటంటే 'ఈగో'. హీరోయిన్‌కి ఈగో ఎక్కువ. అందుకే కూతురికే ఇంత ఈగో ఉంటే, ఇక తల్లికి ఇంకెంత ఈగో ఉంటుందో అనే నాగచైతన్య చెప్పే డైలాగ్‌ టీజర్‌లో హైలైట్‌ అవుతోంది. ఈ ఇద్దరు ఈగో తల్లీకూతుళ్ల మధ్య నాగచైతన్య పాపం ఎలా నలిగిపోతాడో కానీ, చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం భలే భలే నవ్వొచ్చేస్తుందట. 

గతంలో మారుతి తెరకెక్కించిన 'భలే భలే మగాడివోయ్‌' చిత్రంలో హీరో నాని మతిమరుపుతో పుట్టించిన నవ్వులు, ఆ తర్వాత 'బాబు బంగారం'లో వెంకటేష్‌ అతి మంచితనంతో పండిన కామెడీ, హీరో శర్వానంద్‌తో 'మహానుభావుడు'లోని అతి శుభ్రం ఇలా చెప్పుకుంటూ పోతే, ఏదో ఒక లోపం అనే అంశాన్ని హైలైట్‌ చేస్తూ, ఫన్‌ క్రియేట్‌ చేస్తుంటాడు మారుతి. 

ఆ విషయానికి వస్తే, మారుతి కథతో తెరకెక్కుతోన్న టీవీ ఆర్టిస్ట్‌ కమ్‌ దర్శకుడు ప్రభాకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'బ్రాండ్‌ బాబు'కు కూడా 'బ్రాండ్‌' పిచ్చి. లోపమేదైనా, ఫన్‌ మాత్రం మిస్‌ కాడు. అలా ఆగష్టులో రాబోతున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంతో మారుతి ఎంత ఫన్‌ క్రియేట్‌ చేస్తాడో. చైతూకి, అనూకి ఎలాంటి సక్సెస్‌ అందిస్తాడో చూడాలిక.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS