పాల‌ల్లో నిద్ర‌మాత్ర‌లు క‌లిపి ఇచ్చేసింది

మరిన్ని వార్తలు

స‌మంత‌... వెండి తెర‌పై అల్ల‌రి చేస్తే, అందంగా, అద్భుతంగా ఉంటుంది. త‌న చ‌లాకీ త‌నం చూడ‌ముచ్చ‌ట గొలుపుతుంది. నిజ జీవితంలోనూ స‌మంత అల్ల‌రి పిల్లే. సినిమాల్లోకి రాక‌ముందు స‌మంత చేసిన అల్ల‌రి ప‌నుల‌కు హ‌ద్దే ఉండేది కాదు. అలాంటి ఓ అంద‌మైన జ్ఞాప‌కాన్ని పంచుకుంది స‌మంత‌.

ఇంట‌ర్ చ‌దివే రోజుల్లో స‌మంత ఓ గ్యాంగ్ ని మెంటైన్ చేసేద‌ట‌. ఓరోజు స‌ర‌దాగా ప‌బ్ కి వెళ్లాల‌నిపించింద‌ట‌. ఇంట్లో చెబితే పంపించ‌రు. అందుకే..ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేసింది. స‌మంత‌కి లావ‌ణ్య‌, శ‌ర‌ణ్య అనే ఇద్ద‌రు స్నేహితులు ఉండేవారు. వాళ్ల‌తో క‌లిసి ప‌బ్ కి వెళ్లాల‌ని ప్లాన్ చేశారు. ముందుగా స‌మంత‌, లావ‌ణ్య క‌లిసి శ‌ర‌ణ్య ఇంటికెళ్లార్ట‌. శ‌ర‌ణ్య ఇంట్లో ఎవ‌రూ లేరు. అమ్మ‌మ్మ త‌ప్ప‌. ఆవిడ ప‌డుకుంటే... ప‌బ్ కి వెళ్లిపోదాం అని రెడీ అయ్యారు. కానీ.. అమ్మ‌మ్మ ఎప్ప‌టికీ ప‌డుకోక‌పోవ‌డం, ఆమె తాగే పాల‌లో రెండు నిద్ర మాత్ర‌లు క‌లిపి ఇచ్చేశార్ట‌. ఆ పాలు తాగి.. అమ్మ‌మ్మ ప‌డుకోవ‌డంతో.. ముగ్గురూ క‌లిసి ప‌బ్ కి చెక్కేశారు. అలా.. తొలి సారి ప‌బ్ లోకి అడుగు పెట్టింది స‌మంత‌. ``అప్ప‌ట్లో స‌ర‌దాగా అనిపించినా, ఇప్పుడు ఆ సంఘ‌ట‌న గుర్తొస్తే కంగారొస్తుంది. పాల‌ల్లో నిద్ర మాత్ర‌లు క‌లిపి ఇవ్వ‌డం ప్ర‌మాద‌మే. అప్పుడు స‌ర‌దాగా చేసినా, ఏమైనా తేడా వ‌స్తే.. ఏమైపోయేదో అనిపిస్తుంది`` అని ఆ నాటి సంగ‌తుల్ని గుర్తు చేసుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS