సామ్ ఎందుకిలా చేస్తోంది?

మరిన్ని వార్తలు

స్టార్ హీరోయిన్ స‌మంత మాయసైటీస్ కారణంగా కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంది. ఇప్పుడిపుడే మయాసైటీస్ నుంచి కోలుకొని మానసిక స్తైర్యాన్ని పొందింది. సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో నిత్యం ఫాన్స్ కి టచ్ లో ఉంటోంది. ఈ క్రమంలోనే రెగ్యులర్ గా తన అప్‌డేట్స్‌ ని పోస్ట్ చేస్తూ,  ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేసుకొంటోంది. సామ్ మళ్ళీ ఎప్పుడు సినిమాల్లో కనిపిస్తుందో అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ నుంచి మా ఇంటి బంగారం అనే లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే తప్ప ఇంకో ప్రాజెక్ట్ కమిట్ అవలేదు. టాలీవుడ్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో సామ్ పేరు వినిపిస్తోంది.
 

రీసెంట్ గా స‌మంత  కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్ళింది. సామ్ అక్కడికి వెళ్ళటం ఇదేం మొదటి సారి కాదు. తరచుగా అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఫౌండేషన్ లో ధ్యానం చేస్తున్న ఫొటోలని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. 'మనలో చాలామంది గురువు లేదా మెంటార్‌ కోసం వెతుకుతుంటారు. మ‌న జీవితానికి వెలుగు చూపుతూ, స‌రైన మార్గంలో న‌డిపించే వ్య‌క్తిని కనుక్కోవటం చాలా ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం' అని కూడా రాసి పోస్ట్ చేసింది. జ్ఞానం కోసం ప్రపంచం మంతా వెతకాలని, అంతా సులభంగా దొరకదని, వేదాంతం కూడా వల్లించింది.  


అన్ని రకాలుగా కోలుకున్న సామ్, సినిమాలు సంగతి పక్కనపెట్టి మళ్ళీ ఇలా ఆశ్రమం బాట పట్టిందేంటని ఫాన్స్ కలవరపడుతున్నారు. ఆశలే సినిమాకొక కొత్త హీరోయిన్ వస్తున్నటైం లో కెరియర్ ని ప్లాన్ చేసుకోకుండా ఇలా గుళ్ళు, గోపురాలు, ఆశ్రమాలు, తిరుగుతూ కాలక్షేపం చేస్తోందని వాపోతున్నారు. తోటి హీరోయిన్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో భాగం అయ్యి వరుస అవకాశాలతో బిజీగా మారుతుంటే సామ్ మాత్రం యోగాలు , మెడిటేషన్ అంటూ ఇంత కూల్ గా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS