'అర్జున్ రెడ్డి' తో సంచలన విజయం నమోదు చేసిన సందీప్ ఆ సినిమా తర్వాత అదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో తెరకెక్కించాడు. తెలుగు వెర్షన్ కంటే హిందీ రీమేక్ భారీ విజయం నమోదు చేసింది. అయితే 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ వంగా కొత్త సినిమా పట్టాలెక్కలేదు. తాజాగా ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.
నిజానికి 'కబీర్ సింగ్' తర్వాత బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ వంగా సినిమా ఫిక్స్ అయింది. ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాకు 'డెవిల్' అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ తర్వాత మాత్రం రణబీర్ కు స్క్రిప్ట్ విషయంలో పూర్తి సంతృప్తి కలగలేదని అందుకే రిజెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇదే సినిమా గురించి రణబీర్ తో సందీప్ మరోసారి చర్చలు జరుపుతున్నారట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి రణబీర్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారని దాదాపుగా ఈసారి 'డెవిల్' పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు.
మొదటి సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న సందీప్ వంగా ఈసారి 'డెవిల్' తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో వేచి చూడాలి. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' తర్వాత రానున్న సినిమా కావడంతో అంచనాలు మాత్రం భారీగానే ఉంటాయి.