'సరిలేరు..' ఆ సర్‌ప్రైజ్‌ ఏంటబ్బా!

మరిన్ని వార్తలు

మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరూ..' నుండి మరో సర్‌ప్రైజ్‌ రాబోతోంది. 'ల్యాండ్‌ మార్క్‌ అనౌన్స్‌మెంట్‌ రాబోతోంది. సిద్ధంగా ఉండండి..' అంటూ చిత్రయూనిట్‌ లేటెస్ట్‌గా ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు ఈ ల్యాండ్‌ మార్క్‌ అనౌన్స్‌మెంట్‌ రాబోతోంది. అసలింతకీ ఏంటా ల్యాండ్‌ మార్క్‌ అనౌన్స్‌మెంట్‌..? అని ఆడియన్స్‌లో క్యూరియాసిటీ నెలకొంది. ఇంతవరకూ విడుదలైన 'సరిలేరు..' ప్రచార చిత్రాలన్నింటికీ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా అంచనాల్ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాయి. మొన్న వచ్చిన రష్మిక 'హి ఈజ్‌ సో క్యూట్‌..' సాంగ్‌ అయితే, యువతలో పిచ్చ క్రేజ్‌ సంపాదించింది.

 

ఇక తాజాగా రానున్న ఈ ల్యాండ్‌ మార్క్‌ అనౌన్స్‌మెంట్‌ ఎలా ఉండబోతోందో చూడాలి మరి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుని, జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి. ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మిక మండన్నా నటిస్తుండగా, లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి కీలక పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాటి హీరోయిన్‌ సంగీత కూడా ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. దిల్‌రాజుతో కలిసి మహేష్‌బాబు ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS