బాలీవుడ్‌కెళ్తున్న నాని 'జెర్సీ'!

By Inkmantra - October 14, 2019 - 14:44 PM IST

మరిన్ని వార్తలు

ఒకప్పుడు బాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన సినిమాల్ని మన తెలుగులో రీమేక్‌ చేసేవారు. కానీ, ట్రెండ్‌ మారింది. ఇప్పుడు తెలుగులో సక్సెస్‌ అయిన సినిమాలు వెంటనే బాలీవుడ్‌కి వెళ్లిపోతున్నాయి. అక్కడ కూడా మంచి విజయాల్ని నమోదు చేస్తున్నాయి. 'అర్జున్‌రెడ్డి' తదితర తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అయ్యి సంచలన విజయాలు అందుకున్న సంగతి ఈ మధ్య చూశాం. ఇప్పుడు మరో తెలుగు సినిమా బాలీవుడ్‌కి వెళ్లనుంది. నేచురల్‌ స్టార్‌ నాని నటించిన 'జెర్సీ' మూవీ తెలుగులో మంచి విజయం అందుకుంది.

 

ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు గత కొంత కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ఓ క్లారిటీ వచ్చింది. బాలీవుడ్‌ నిర్మాత అమన్‌ గిల్‌తో కలిసి మన టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌రాజు ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేయనున్నామని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించబోతున్నారట. స్పోర్ట్స్‌ నేపథ్యంలో వచ్చే సినిమాలకు బాలీవుడ్‌లో గిరాకీ ఎక్కువ.

 

ఈ సినిమాలో ఏజ్‌ బార్‌ క్రికెటర్‌గా హీరో కనిపిస్తాడు. తెలుగులో నాని ఆ పాత్రకు చక్కగా న్యాయం చేశాడు. ఇక హిందీలో ఈ పాత్ర పోషించేందుకు షాహిద్‌కపూర్‌ సిద్ధంగా ఉన్నాడు. హిందీ అర్జున్‌రెడ్డితో కబీర్‌ సింగ్‌కి తిరుగులేని గుర్తింపు దక్కింది. ఇక 'జెర్సీ' రీమేక్‌తో మరోసారి మంచి హిట్‌ దక్కించుకుంటాడేమో మనోడు చూడాలిక. వచ్చే ఏడాది 2020న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS