'శాకుంతలం' టీమ్‌ ఆపేస్తే అవి ఆగిపోతాయా?

మరిన్ని వార్తలు

విలక్షణ దర్శకుల్లో ఒకరైన గుణశేఖర్‌ ప్రాజెక్టుల్లో ఒకటి 'శాకుంతలం'. సమంత లీడ్‌ రోల్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో ఈ సినిమాని గుణ శేఖర్‌ అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. వన్స్‌ సినిమా అనౌన్స్‌ అయ్యిందంటే చాలు, అందులోని క్యారెక్టర్స్‌పై మీడియాలో ఊహాగానాలు మొదలవడం సర్వసాధారణం. అలాగే ఈ సినిమాలోనూ క్యారెక్టర్స్‌ విషయమై గత కొంత కాలంగా డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్‌గా గుణ అండ్‌ టీమ్‌ స్పందించింది. క్యారెక్టర్స్‌ ఎంపికపై గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతోంది.

 

ఓ ప్రత్యేకమైన టీమ్‌ దీనిపై కసరత్తులు చేస్తోంది. లీడ్‌ రోల్‌ సమంత తప్ప ఇంతవరకూ ఏ క్యారెక్టర్‌ ఫైనల్‌ కాలేదు. దయచేసి, క్యారెక్టర్స్‌ విషయంలో ఎలాంటి ఊహాగానాలు వద్దని 'శాకుంతలం' అండ్‌ టీమ్‌ అంటోంది. అయితే, వద్దంటే ఆపేస్తారా.? చెప్పండి. ఎవరి పని వారిదే. ఇకపోతే, 'రుద్రమదేవి' సినిమా తర్వాత డైరెక్టర్‌ గుణ శేఖర్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నారు. రానాతో 'హిరణ్యకశ్యప' సినిమాని అనౌన్స్‌ చేశారు. ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదింతవరకూ. ఆ లోగానే 'శాకుంతలం' అనౌన్స్‌మెంట్‌ జరిగింది.

 

అయితే, రానా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కారణంగా, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును హోల్డ్‌ల్‌ పెట్టేసి, ఫుల్‌ ఫోకస్‌ 'శాకుంతలం' సినిమాపై పెట్టాడనీ తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ వచ్చే అవకాశముంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS