మలర్‌ బ్యూటీ మంచి పిల్లేనండీ బాబూ.!

మరిన్ని వార్తలు

'ఫిదా' సినిమాతో చిన్నా, పెద్దా, క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అందరి మనసుల్ని గెలిచేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. 'మలర్‌' సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టి, తెలుగులో 'ఫిదా' అంటూ వచ్చి అందరి నోటి వెంటా 'ఫిదా' బ్యూటీ అనిపించుకుంది. తొలి సినిమాకే వందకి వంద మార్కులు వేయించుకుని, అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. తర్వాత నానితో చేసిన 'ఎంసీఏ' సినిమాతోనూ సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత నాగశౌర్యతో 'కణం' మూవీలో నటించింది. 

అయితే సక్సెస్‌ ఎంతగా కూడబెట్టుకుందో, అమ్మడి చుట్టూ రూమర్స్‌ కూడా అంతేలా చక్కర్లు కొట్టాయి. చాలా నెగిటివ్‌ కామెంట్స్‌ని కూడా వెంట తెచ్చుకుంది సాయి పల్లవి. మెగా హీరో వరుణ్‌తేజ్‌ని పక్కన పెడితే, తర్వాత ఈ బ్యూటీ నటించిన ఇద్దరు హీరోలతోనూ సాయి పల్లవి మాటలు పడాల్సి వచ్చింది. ఏకంగా ఈ ఇద్దరు హీరోలు ఓపెన్‌గా సాయిపల్లవిని ఆడి పోసుకున్నారు. అయితే తాజాగా మరో యంగ్‌ హీరో శర్వానంద్‌ మాత్రం సాయి పల్లవిని తెగ పొగిడేస్తున్నాడు తెలుసా. 

సాయి పల్లవి - శర్వానంద్‌ జంటగా 'పడి పడి లేచె' మనసు సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఈ సందర్భంగా శర్వానంద్‌ తన కోస్టార్‌ అయిన సాయి పల్లవిని పొగిడే పని పెట్టుకున్నాడు. నటన పరంగా ఆమెను కొట్టే వారు లేరనీ, ఒక్కసారి కలిసి నటిస్తే, సాయి పల్లవితో మళ్లీ మళ్లీ నటించాలనిపించే నటి అని శర్వానంద్‌ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించాడు. 

హమ్యయ్యా ఇంతటితో సాయి పల్లవిపై వచ్చిన రూమర్స్‌కి చెక్‌ పడుతుందేమో. శర్వా మాటలకు ఆమె ఫ్యాన్స్‌ కాస్త రిలాక్స్‌ అయ్యారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS