శర్వానంద్ జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే..!

మరిన్ని వార్తలు

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తెలుగు హీరోలలో శర్వానంద్ ఒకడు. ఈయన తాజాగా ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ ఇచ్చాడు.

అదేమనగా- నిర్మాతగా మారి కో అంటే కోటి అనే సినిమా తీయడమే, సినీ కెరీర్ మొత్తంలో తాను చేసిన ఏకైక పెద్ద తప్పు అని పేర్కొన్నాడు. ఆ సినిమా కోసం తాను అప్పటివరకు సినిమాలలో సంపాదించినదంతా పెట్టేశాను అని అయితే ఆ చిత్రం తనకి నష్టాలని మిగిలిచింది అని చెప్పుకొచ్చాడు.

దాదాపు మూడేళ్ళ పాటు ఆ ఇబ్బందులు పడ్డాను అని, అందుకే భవిష్యత్తులో అటువంటి పని ఏమి చేయను అని తేల్చి చెప్పాడు. ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవాపుడి దర్శకత్వంలో పడి పడి లేచెను మనసు చిత్రంలో నటిస్తున్నాడు, ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నది.

ఈ పైన విషయం చదివాక, నిర్మాతగా మారి సినిమా తీయడం అనేది అంత సలువు కాదు అని మాత్రం అందరికీ తెలుస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS