శ్రియ‌ని బాల‌య్య వ‌దిలేలా లేడే..?

మరిన్ని వార్తలు

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సెంటిమెంట్లు ఎక్కువ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప్ర‌తీ విష‌యంలోనూ సెంటిమెంట్ ఫాలో అవుతారు. ఇప్పుడు శ్రియ కూడా బాల‌య్య సెంటిమెంట్ల జాబితాలో చేరిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. 

'చెన్న‌కేశ‌వ‌రెడ్డి'లో తొలిసారి వీరిద్ద‌రూ జంట‌గా న‌టించారు. ఆ త‌ర‌వాత చాలా గ్యాప్ తీసుకుని 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి'లో మ‌ళ్లీ జోడీ క‌ట్టారు. అక్క‌డి నుంచి శ్రియ బాల‌య్య‌కు సెంటిమెంట్‌గా మారిన‌ట్టు క‌నిపిస్తోంది. 'నీతో మ‌రోసారి క‌ల‌సి న‌టిస్తా' అంటూ 'గౌత‌మిపుత్ర' వేడుక‌లో బాల‌య్య మాటిచ్చాడు.

అన్న‌ట్టుగానే 'పైసా వ‌సూల్లో' శ్రియ‌ని క‌థానాయిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు మ‌రోసారి శ్రియ సెంటిమెంట్ ని బాల‌య్య ఫాలో అయిన‌ట్టు క‌నిపిస్తోంది. బాల‌య్య తాజా చిత్రం 'ఎన్టీఆర్‌'లో శ్రియ‌కు ఓ పాత్ర క‌ట్ట‌బెట్టిన‌ట్టు తెలుస్తోంది.  `ఎన్టీఆర్` బ‌యోపిక్‌లో చాలా పాత్ర‌ల‌కు చోటుంది. సావిత్రి, జ‌మున‌, జ‌య‌సుధ‌, శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద‌.. ఇలా అల‌నాటి పాత్ర‌ల్ని తెర‌పై చూపిస్తారు. శ్రీ‌దేవిగా ర‌కుల్ క‌నిపించ‌నుంది. 

మ‌రి శ్రియ‌కు ఎలాంటి పాత్ర ఇచ్చారో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి.  మొత్తానికి శ్రియ బాల‌య్య‌కు బాగా క‌లిసొచ్చిన‌ట్టు అనిపిస్తోంది. అందుకే... ప్ర‌స్తుతానికి శ్రియ‌ని వ‌దిలేలా లేడు మ‌న బాల‌య్య‌.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS