'షుగర్‌' కోసం సాహసం చేస్తామంటోన్న 'పేట' భామలు!

మరిన్ని వార్తలు

'పేట' సినిమా కోసం సీనియర్‌ హీరోయిన్లు సిమ్రాన్‌, త్రిష సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో జత కట్టారు. సూపర్‌ స్టార్‌తో జోడీ అయితే కట్టారు. కానీ, ఈ సినిమాలో ఇద్దరికీ పెద్దగా కంబైండ్‌ సీన్స్‌ లేవు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పుడు అక్కా చెల్లెళ్ల అవతారమెత్తారు ఓ సినిమా కోసం. సుమంత్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'షుగర్‌' అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. దాదాపు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీగా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారు. ఈ సినిమా కోసం, త్రిష, సిమ్రాన్‌ తమ వయసును మర్చిపోయి బోలెడంత కష్టపడ్డారట.

 

ఈ ఇద్దరిపై ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ ఘట్టాలను చిత్రీకరించాడట డైరెక్టర్‌. ఆ యాక్షన్‌ సీన్స్‌ అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందట. ఒకప్పుడు సిమ్రాన్‌ అంటే స్టార్‌ హీరోయిన్‌. అగ్ర కథానాయకులందరితోనూ నటించి, పలు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. ఇటీవలే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన సిమ్రాన్‌ మంచి మంచి అవకాశాలతో దూసుకెళ్లిపోతోంది. తెలుగులో ఇంకా సిమ్రాన్‌ని ఛాన్స్‌ వరించలేదు. కానీ, తమిళంలో ఇప్పటికే వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

 

ఇక త్రిష సంగతి చెప్పనే అక్కర్లేదు. అప్పుడూ, ఇప్పుడూ కూడా అదే స్టార్‌డమ్‌ కొనసాగిస్తోంది. అయితే, అప్పుడు కమర్షియల్‌ హిట్స్‌ సొంతం చేసుకున్న త్రిష ఇప్పుడు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇక తాజా సినిమా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు మంచి పేరు తెచ్చిపెడుతుందంటున్నారు. యాక్షన్‌ ప్రధానాంశంగా సాగే ఈ అక్కచెల్లెళ్ల కథ ఏంటో తెలియాలంటే ఇన్నోవేటివ్‌ టైటిల్‌తో వస్తోన్న 'షుగర్‌' చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS