సింగీతం శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ గర్వించే దర్శకుల్లో ఒకరు. ఆయనకు ఇప్పుడు కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయనే తెలియజేశారు. కొద్దిరోజు క్రితం అస్వస్థతకు గురయ్యానని, పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటీవ్ అని తేలిందని, అప్పటి నుంచి హోం ఐసొలేషన్లోనే ఉన్నానని ప్రకటించారు సంగీతం. పుష్షక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 లాంటి అద్భుతాలు.. సింగీతం నుంచే వచ్చాయి. ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టు తయారు చేస్తున్నారు.
కథానాయికగా సమంత పేరు పరిశీలనలో ఉంది. కరోనా విపత్తు నుంచి ఉపశమనం దొరికాక.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈలోగా.. సింగీతం కరోనా బారీన పడ్డారు. అయితే.. తన ఆరోగ్యం బాగానే ఉందని, కరోనా లక్షణాలు అతి స్వల్పంగానే ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సింగీతం చెబుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.