‘మేజర్‌’ కోసం తెలుగమ్మాయ్‌ ఇంకోస్సారి!

మరిన్ని వార్తలు

‘గూఢచారి’ సినిమాలో హీరోయిన్‌గా మెరిసిన ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ్ల. బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించిన ఈ అచ్చతెలుగు భామ తెలుగులో డెబ్యూ చేసిన సినిమా ఇదే. ఈ మూవీలో హీరో అడవి శేష్‌తో ఫుల్‌గా రొమాన్స్‌ పండించిన ఈ భామ మరోసారి అడవిశేష్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి సిద్ధమవుతోంది. అడవి శేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘మేజర్‌’ సినిమాలో శోభితా ధూళిపాళ్ల నటిస్తోందని కన్‌పామ్‌ చేస్తూ, లేటెస్ట్‌గా చిత్ర యూనిట్‌ ఓ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసింది. ఈ సినిమాలో శోభిత పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. మహేష్‌బాబు నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకి, శశికిరణ్‌ తిక్కా దర్శకుడు.

 

ఇకపోతే, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, హీరోగా తన ఉనికిని చాటుకుంటున్న అడవి శేష్‌కి ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది. ‘మేజర్‌’గా కనిపించాలన్న మహేష్‌బాబు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌కి అడవి శేష్‌ని హీరోగా ఎంచుకోవడం, తన ఓన్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందడం నిజంగా శేష్‌ అదృష్టమే. భారీ టెక్నికల్‌ వాల్యూస్ తో రూపొందించిన ‘గూఢచారి’ మూవీ అడవి శేష్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ‘మేజర్‌’తో మరోసారి ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలనుకుంటున్నాడు. ‘గూఢచారి’ సక్సెస్‌ని కంటిన్యూ చేసేందుకు, అడవి శేష్‌కి తెలుగమ్మాయ్‌ శోభిత మళ్లీ కలిసొస్తుందా? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS