‘గూఢచారి’ సినిమాలో అడవి శేష్కి జంటగా నటించిన ముద్దుగుమ్మ శోభితా దూళిపాళ్ల గుర్తుంది కదా.. ఈ అమ్మాయి ఇప్పుడు కోలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది. కోలీవుడ్లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్లో శోభితకు చోటు దక్కింది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రముఖ తారలు విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, విక్రమ్ ప్రభు, అదితీ రాయ్ హైదరీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు, శోభితకూ ఓ మంచి పాత్ర దక్కింది. 2013 మిస్ ఎర్త్ పోటీల్లో కిరీటం దక్కించుకున్న ఈ తెలుగమ్మాయి బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. మదర్ టంగ్లో సినిమా చేసేందుకు చాలా రోజులే పట్టింది కానీ, అడవి శేష్తో ‘గూఢచారి’ సినిమాతో ఆ ఛాన్స్ దక్కించుకుంది.
తొలి సినిమాకే హ్యాండ్సమ్ హీరోతో లిప్లాక్స్, గాఢమైన రొమాంటిక్ సీన్స్లో కనిపించి మెప్పించింది. కానీ, మరో ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు కోలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటోంది. ‘పొన్నియన్ సెల్వన్ తో ఎంట్రీ ఇస్తోంది. ఇదో హిస్టారికల్ డ్రామా. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ హిస్టారికల్ డ్రామాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తోంది. ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2021 ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.