హ‌మ్మ‌య్య‌.. నెగిటీవ్ వ‌చ్చింది!

మరిన్ని వార్తలు

టాలీవుడ్ కి ఇది శుభ‌వార్త‌. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి క‌రోనా బారీ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. కొన్ని రోజుల క్రింద‌ట త‌న‌కు క‌రోనా సోకిన విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కీ, త‌న కుటుంబ స‌భ్యుల‌కూ క‌రోనా సోకింద‌ని ఆయ‌న ధృవీక‌రించారు. అప్ప‌టి నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. ఇప్పుడు క‌రోనా నుంచి వాళ్లంతా బ‌య‌ట ప‌డ్డారు. ఈరోజు క‌రోనా టెస్టులు చేయిస్తే నెగిటీవ్ అని తేలింది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి ట్విట్ట‌ర్‌లో ధృవీక‌రించారు. ``రెండు వారాల క్వారెంటైన్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతానికి ఎలాంటి ల‌క్ష‌ణాలూ లేవు. క‌రోనా టెస్టులు చేయిస్తే.. నెగిటీవ్ వ‌చ్చింది. ప్లాస్మా డొనేష‌న్ కోసం మ‌రో మూడు వారాలు ఎదురు చూడ‌మ‌ని వైద్యులు సూచించారు`` అంటూ ట్వీట్ చేశారు.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్‌.ఆర్‌.ఆర్‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల్ల షూటింగ్ ఆగిపోయింది. రాజ‌మౌళికి క‌రోనా సోక‌డంతో.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` షూటింగ్ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. ఇప్పుడు ఆయ‌న కోలుకున్నారు. కాక‌పోతే... ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి ఇంకొంచెం స‌మ‌యం ప‌డుతుంది. బ‌హుశా.. వ‌చ్చే నెల‌లో.. ఆయ‌న ఈ సినిమాపై దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS