'సవ్యసాచి'లో 'సుభద్ర పరిణయం' చూశారా?

మరిన్ని వార్తలు

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి 'సుభద్ర పరిణయం' ఎపిసోడ్‌ని (వీడియో ప్రోమో) విడుదల చేశారు. సినిమాలో ఇది బీభత్సమైన కామెడీ ఎపిసోడ్‌ అట. కృష్ణుడు, అర్జునుడు, బలరాముడు.. ఇలా ప్రముఖ పాత్రధారులతో కాలేజీలో ఏర్పాటు చేసిన ఓ నాటక ప్రదర్శన ఈ 'సుభద్ర పరిణయం'. 

ఇందులో జబర్‌దస్త్‌ ఆది, వెన్నెల కిషోర్‌ తదితరులు హీరో నాగచైతన్యతోపాటు కన్పిస్తున్నారు. అర్జునుడి గెటప్‌లో అక్కినేని నాగార్జున కన్పిస్తుండగా, కృష్ణుడి గెటప్‌లో వెన్నెల కిషోర్‌ నవ్వులు పూయిస్తుండడం గమనార్హం. ఇప్పటిదాకా 'సవ్యసాచి' టీమ్‌ నుంచి బయటకొచ్చిన ప్రోమోస్‌ అన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. టీజర్‌.. దాన్ని మించి ట్రైయిలర్‌.. వీటికి మించేలా సాంగ్‌ ప్రోమోస్‌.. సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేసేశాయి. దాంతో సహజంగానే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. 

నాగచైతన్య సరసన బాలీవుడ్‌ భామ నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు. 'నిన్ను రోడ్డు మీద చూసినాక..' అంటూ అక్కినేని నాగార్జున సూపర్‌ హిట్‌ సాంగ్‌ని ఈ సినిమా కోసం రీమిక్స్‌ చేశారు. ఇదొక్కటే కాదు, 1980, 81, 82.. అంటూ సాగే మరో పాట ఈ సినిమాకి ఇంకో హైలైట్‌ కాబోతోంది. తమిళ నటుడు మాధవన్‌ తొలిసారి స్ట్రెయిట్‌గా తెలుగులో చేస్తున్న సినిమా ఇది. 

ఈ సినిమాలో భూమిక మరో ముఖ్యమైన పాత్రలో కన్పించబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS