'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్ సడెన్గా షాకిచ్చింది. బికినీలో ప్రత్యక్షమైంది. తొలి సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ కెరీర్లో చాలా ఎత్తు పల్లాలు చూసేసింది. కెరీర్ మొదట్లోనే అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలి సినిమా తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు శ్వేతా కెరీర్లో. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మధ్యనే 'మిఠాయి పొట్లం' అనే ఓ చిన్న సినిమాలో తళుక్కున మెరిసింది. ఆ సినిమాలో కాస్త బొద్దుగా కనినపించిన ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలో జీరో సైజ్ అందాలతో బికినీలో దర్శనమిచ్చింది. నవ్వులు చిందిస్తూ ఫుల్ జోష్లో ఉంది.
ఈ ఫోటో చూసి, శ్వేతా అభిమానులు అవాక్కవుతున్నారు. అసలింతకీ ఈ ఫోటోలో ఉన్నది శ్వేతానేనా.? అని ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైతేనేం, మొత్తానికి శ్వేతా బికినీ అందాలు చూస్తుంటే, జనానికి కొత్త ఆలోచనలు వస్తున్నాయి. పాప ఏదో జాక్పాట్ పట్టినట్లుందే. అందుకేనేమో ఇంత హుషారు అనుకుంటున్నారు. అవునేమో.. చూసేద్దాం. అందాకా ఈ లేటెస్ట్ పిక్లో శ్వేతా అందాల్ని ఆస్వాదిద్దాం.